Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య..

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (11:45 IST)
భర్త వేధింపులు భరించలేకపోయిన నూతన వధువు.. పెళ్లైన నెల రోజులకే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హిందూపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో నివసిస్తున్న వెంకటేశులు, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె పల్లవి (28) ఉన్నత విద్యనభ్యసించింది. ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన పల్లవి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
 
ఈ క్రమంలో పల్లవిని కుటుంబ సభ్యులు.. ఆగస్టు 27న పామిడికి చెందిన ప్రైవేటు టీచర్ మలికార్జునకు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే.. పెళ్లి అయిన కొన్ని రోజులకే.. ఇచ్చిన కట్నకానుకలు చాలవని, అదనపు కట్నం తీసుకురావాలంటూ పల్లవిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త వేధింపులను తట్టుకోలేకపోయిన పల్లవి నెల రోజులకే పుట్టింటికి వెళ్లింది. 
 
పది రోజులుగా పుట్టింట్లో ఉన్న పల్లవిని.. భర్త తరచూ ఆమెకు ఫోన్‌ చేసి మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో పల్లవి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments