Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన నెల రోజులకే నవ వధువు ఆత్మహత్య..

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (11:45 IST)
భర్త వేధింపులు భరించలేకపోయిన నూతన వధువు.. పెళ్లైన నెల రోజులకే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హిందూపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో నివసిస్తున్న వెంకటేశులు, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె పల్లవి (28) ఉన్నత విద్యనభ్యసించింది. ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన పల్లవి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
 
ఈ క్రమంలో పల్లవిని కుటుంబ సభ్యులు.. ఆగస్టు 27న పామిడికి చెందిన ప్రైవేటు టీచర్ మలికార్జునకు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే.. పెళ్లి అయిన కొన్ని రోజులకే.. ఇచ్చిన కట్నకానుకలు చాలవని, అదనపు కట్నం తీసుకురావాలంటూ పల్లవిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త వేధింపులను తట్టుకోలేకపోయిన పల్లవి నెల రోజులకే పుట్టింటికి వెళ్లింది. 
 
పది రోజులుగా పుట్టింట్లో ఉన్న పల్లవిని.. భర్త తరచూ ఆమెకు ఫోన్‌ చేసి మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో పల్లవి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments