Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిక‌లు... ఉత్సాహం!

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (15:21 IST)
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ‌లోకి విచిత్రంగా వైసీసీ నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేరుతున్నారు. బద్వేలు  ఎన్నికల ప్రచారంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వైసీపీ నుండి బిజెపి లోకి చేరికలు మొద‌ల‌య్యాయి అక్క‌డ‌. పార్టీలోకి స్థానిక నాయకులు శివ రెడ్డి, వారి అనుచరులు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో చేరారు. బీజేపీలో చేరుతున్నసందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. కలశ‌పాడులోని బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ  భారీ ప్రదర్శన నిర్వహించారు.
 
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ, బ‌ద్వేలు ఉప ఎన్నికల లో గెలుపు బిజెపిదే అని అన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారని అభినందించారు. ఇదే ఊపు కొన‌సాగితే, బీజేపీ ఇక్క‌డ విజ‌యం పొందుతుంద‌ని సోము వీర్రాజు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ టీడీపీ, జ‌న‌సేన బ‌రిలో నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం, కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు వైసీపీతో త‌ల‌ప‌డుతున్నాయి. ఇందులో త‌మ విజ‌యం సునాయాస‌మ‌ని వైసీపీ ఎప్పుడో ప్ర‌క‌టించింది. అయినా, బీజేపీ, కాంగ్రెస్ త‌మ స‌త్తా చూపాల‌ని ఆరాట‌ప‌డుతున్నాయి.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments