Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంట తడిపెట్టిన వెంకయ్య.. ఎందుకో తెలుసా?

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు కంట తడి పెట్టారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న వెంకయ్య ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తల్లి లాంటి భారతీయ జనతా పార్టీని వదిలి పెట్టడం ఎంతో బాధగా ఉం

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (20:05 IST)
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు కంట తడి పెట్టారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న వెంకయ్య ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తల్లి లాంటి భారతీయ జనతా పార్టీని వదిలి పెట్టడం ఎంతో బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. సొంత జిల్లా నెల్లూరులో పర్యటిస్తున్న వెంకయ్యకు ఆ జిల్లా ప్రజలు, బిజెపి, టిడిపి నాయకులు ఘనస్వాగతం పలికారు.
 
నగరంలో భారీ ర్యాలీలో పాల్గొన్న వెంకయ్యకు స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన సభలో వెంకయ్య ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. తన చిన్నప్పుడే తల్లి చనిపోయిందని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో పుట్టిన తాను సాధారణ కార్యకర్త ఉంచి ఉపరాష్ట్రపతిగా ఎదగడానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణే ముఖ్య కారణమన్నారు. 
 
కష్టపడడం ఆర్.ఎస్.ఎస్‌లో నేర్చుకుంటే క్రమశిక్షణ బిజెపిలో నేర్చుకున్నట్లు చెప్పారు. బిజెపిని వదలడం మాత్రం చాలా బాధగా ఉందని కంట కన్నీరు పెట్టారు వెంకయ్య. దీంతో స్థానిక నేతలు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. వెంకయ్య కన్నీరు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments