Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నీలం సాహ్ని

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (07:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. నీలం సాహ్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోగన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. 
 
కాగా, ప్రస్తుత ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేసి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
నిజానికి కొత్త ఎస్ఈసీ కోసం ఏపీ సర్కారు ముగ్గురి పేర్లను ప్రతిపాదించగా, వారిలో నీలం సాహ్నీ ఒకరు. తాజాగా ఆమె పేరును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేయడంతో ఏపీ కొత్త ఎస్ఈసీ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
 
నీలం సాహ్నీ ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. నీలం సాహ్నీ గత డిసెంబరులో ఏపీ సీఎస్‌గా పదవీ విరమణ చేశారు. ఆపై ఆమె సీఎం జగన్ ప్రధాన సలహాదారుగా నియమితులవడం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments