Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ పోర్ట్ లో క‌లిసిన టీడీపీ బృందం; సాయంత్రం టైం ఇచ్చిన ఎస్సీ కమిషన్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:53 IST)
గుంటూరులో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై విచారణ జరపడానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్‌ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్‌ కమిషన్‌ అధికారులను గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లోనే కలిశారు.

ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్‌ సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. అనంతరం కమిషన్ బృందం గుంటూరు బయల్దేరింది.

అంతక ముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందానికి పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి, గన్నవరం డీటీ శ్రీనివాసరావు, భాజపా ముఖ్య నాయకులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం.. 2వేల ఎకరాలు.. 2500 సినిమాలు

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments