Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021"

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (11:52 IST)
నెల్లూరు జిల్లా ఐటిఐ క్యాంపస్ లో "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021 ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ‌చ్చారు. నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురం ఐ.టీ.ఐ క్యాంపస్(బాలురు)లో  నిర్వహిస్తున్న  "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021"లో ముఖ్య అతిథిగా హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాల‌పై విస్తృతంతా చ‌ర్చిస్తున్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ గణేష్,  ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస మధు, జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నతాధికారులు ఈ మేళా ద్వారా యువ‌త‌కు ప‌రిశ్ర‌మ‌ల‌లో మెళ‌కుల‌వ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాను ప్రారంభించారు. ఈ అప్రెంటిస్షిప్ మేళాలో ప్రముఖ కంపెనీలు అశోక్ లేల్యాండ్, శ్రీసిటీ, టీవీఎస్, ఆర్టీసీ, రైల్వే, షార్, నెల్ కాస్ట్, ఫార్మా త‌ద‌త‌ర కంపెనీలు పాల్గొంటున్నాయి. అప్రెంటిస్షిప్ మేళాకు హాజరైన వందలాది మంది యువతీ యువకులు ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments