Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసభ్య పదజాలంతో దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై కేసు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (10:20 IST)
పోలీసులను, అధికార వైకాపా పార్టీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడుతో సహా మొత్తం 9 మంది తెదేపా నాయకులపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండుగ పెద్ద జాగారం వేడుకలు జరిగాయి. ఇందులోభాగంగా ఈ నెల 15వ తేదీన అబీద్ కూడలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. 
 
రాత్రి 11.10 గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ తదితరులు పోలీసులను, వైకాపా నేతలను దూషించి, పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించారని పేర్కొంటూ నర్సీపట్నం పోలీసులు ఐపీసీ 353, 294 (ఏ, బి), 504, 505(ఏ), రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments