Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ శాఖను నారా లోకేష్‌కు ఇచ్చేస్తారా... మంత్రి బొజ్జకు మీడియా ప్రశ్న

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారె

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:50 IST)
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు ఐటీ, సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, రావెళ్ళ కిషోర్ బాబులకు పదవులు పోయినట్లేనని ఇప్పటికే వదంతులు వినిపిస్తున్నాయి. సమాచార శాఖామంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డికి మాత్రం పదవి పోదు గానీ ఆయనకు కేటాయించిన ఒక శాఖను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ఎందుకంటే తెలంగాణాలో కేసీఆర్ తన కుమారుడికి ఐటీ శాఖను అప్పజెప్పినట్లుగా చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేష్‌కు ఐటీ శాఖని అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే పల్లెరఘునాథ రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఉన్న శాఖను మార్పు చేస్తే ఏం చేయాలో పాలుపోక తికమకపడుతున్నారు. 
 
ఇదేవిషయాన్ని తిరుపతిలో ఒక మీడియా ప్రతినిధి పల్లె రఘునాథ రెడ్డిని ప్రశ్నించగా ఆయన కొద్దిసేపు నీళ్ళు నమిలారు. అదంతా చంద్రబాబు ఇష్టం అని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం చాలామంది మంత్రుల్లో భయం పట్టుకుంది. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments