ఆర్టీసీ బస్సెక్కిన నారా లోకేష్.. వైకాపాపై ఫైర్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (20:47 IST)
Nara lokesh
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా పిచ్చాటూరులో లోకేష్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు.. వైసీపీ పాలనలో ఆర్టీసీ ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. 
 
ఛార్జీలు పెంచి విపరీతంగా భారం పెంచారని ప్రయాణికులు లోకేష్‌తో చెప్పారు. వైకాపా సర్కారు ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వారు ప్రయాణించే ఆర్టీసి ఛార్జీలను మూడు సార్లు పెంచిందన్నారు.
 
ప్రభుత్వం విలీనం తర్వాత ఆర్టీసీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేసిన లోకేష్, కండక్టర్‌ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఛార్జీలను మూడు రెట్లు పెంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన లోకేష్.. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
 
అంతకముందు లోకేష్ ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో సమావేశమైనారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని ఫైర్ అయ్యారు. ఇంకా కార్పొరేషన్ లోన్‌లు రావట్లేదన్నారు. 300 యూనిట్ల విద్యుత్ ఉచితం అన్నారని.. ఉచిత విద్యుత్ మాట దేవుడెరుగు విద్యుత్ బిల్లులు కట్టాలని వేధిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments