Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో నేను ఆ పని చేస్తా నాన్నా... మీ సహాయం కావాలి... నారా లోకేష్ గట్టి నిర్ణయం

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (18:10 IST)
ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను దేనికదే అభివృద్ధిలో తేడా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు కృషి చేస్తున్నారు. మరోవైపు యువ నాయకుడు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తన కార్యచరణకు సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనా నారా లోకేష్ ప్రత్యేకంగా కరవు సీమగా పేరొందిన రాయలసీమపై దృష్టి సారించినట్లు చెపుతున్నారు. 
 
ఇక్కడ ఉపాధి అవకాశాలు సాధించుకుంటే సీమ నాలుగు జిల్లాల ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లే గతి పట్టదనీ, ప్రజలకు ఉపాధినిచ్చే భారీ పరిశ్రమలకు కృషి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేష్ తొలుత కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని కృషి చేస్తున్నారట. వైఎస్ హయాంలో ఫ్యాక్టరీ నిర్మించేందుకు 10 వేల ఎకరాలు కేటాయించినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. 
 
ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులతో కాకుండా ప్రభుత్వరంగ సంస్థలతోనే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయసహకారాలు కూడా కావాలని కోరినట్లు చెపుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments