Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీకి నిధుల కొరత.. మరమ్మతులు నిల్.. అందుకే ఈ ప్రమాదాలు : నారా లోకేశ్

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (13:35 IST)
విజయవాడ బస్టాండులో జరిగిన బస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, ఏపీ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీఎస్ ఆర్టీసీలో నిధులు లేవని, అందుకే బస్సులకు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించారు. ఈ ప్రమాదంపై ఆయన స్పందిస్తూ, 
ఫ్లాట్‌ఫాంపైకి బస్సు దూసుకునికి వచ్చి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదన్నారు. 
 
నాలుగున్నరేళ్ళుగా ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టులు కూడా కొనుగోలు కూడా చేయలేని దుస్థితిలో ఆర్టీసీ సంస్థ ఉందన్నారు. రిక్రూట్మెమంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలుపుతున్నట్టు నారా లోకేశ్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments