Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ గుంటూరు పర్యటన: అనూష కుటుంబానికి పరామర్శ

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (10:53 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటనకు రానున్నారు. నరసరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రానున్నారు. 
 
అనూష పుట్టినరోజును ఆమె ఇంట్లోనో, స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం టీడీపీ నేతలు దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు.
 
నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కోవిడ్‌ నిబంధనలతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. 
 
మహిళలపై జరిగే నేరాలను రాజకీయం చేయవద్దని.. రమ్య కేసు విషయంలోనూ ఇదేవిధంగా రాజకీయం చేశారన్నారు. ఫిబ్రవరిలో అనూష హత్యకు గురైతే, ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వస్తుండటం రాజకీయం కోసమేనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments