Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది జాబ్ క్యాలెండర్ కాదు.. జాదూ క్యాలెండర్: నారా లోకేష్ ఫైర్

Webdunia
గురువారం, 15 జులై 2021 (23:11 IST)
ఏపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌‌పై  మండిపడ్డారు. ఈ మేరకు నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించిన లోకేష్ వారితో చర్చించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి జాదూ క్యాలెండర్‌తో యువతకి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులు పడుతున్న ఆందోళన చూస్తే బాధేస్తుందని పేర్కొన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని నిరుద్యోగులు నిరుత్సాహ పడొద్దని లోకేష్ సూచించారు. ప్రభుత్వంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.
 
ఫ్యాన్ తిప్పుతూ అధికారం రాగానే 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని, 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు ఒకే సారి నోటిఫికేషన్ అన్నారని, కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అదే ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తరువాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేసి యువతకి తీరని ద్రోహం చేసారని లోకేష్ మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు స్థోమతకు మించి అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారని…ఇప్పుడు వారంతా తిరిగి ఊరు వెళ్లలేక, అమ్మానాన్నలకు మొఖం చూపించలేక ఆందోళనలో ఉన్నారని ఆవేదన చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments