Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి బరిలో నారా లోకేశ్...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (09:27 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ప్రకటించారు. మొత్తం 126 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన.. 76 మంది సిట్టింగ్‌లకు మళ్లీ సీట్లు కేటాయించారు. ఈ జాబితాలో 33 మంది బీసీలకు, 21 మంది ఎస్సీ, ఎస్టీలకు చోటు కల్పించారు. ఈ తొలి జాబితాలోనే తన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు కూటా నియోజకవర్గం కేటాయించారు. ఆయన మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. 
 
నారా లోకేశ్, నిజానికి తొలుత భీమిలి నియోజకవర్గంలో పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం మంగళగిరి టికెట్ కేటాయించింది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని భావించిన నారా లోకేశ్ గురువారం వ్యూహాత్మకంగా ప్రచారం మొదలుపెట్టారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఎంతో చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్ర రాజధాని రావడం అదృష్టమని లోకేశ్ అన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, తన ప్రచారంలో కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఏపీ నేతలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తూ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments