Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యాలయం వద్ద మ‌ళ్ళీ ఉద్రిక్తత... మూవ్... మూవ్ అంటూ లోకేష్!

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (16:29 IST)
ఏపీలో రాజ‌కీయ కొట్లాట‌లు శృతి మించుతున్నాయి. నిన్న మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌గా, నేడు మ‌ళ్ళీ అదే కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒక ద‌శ‌లో టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోలీసులపై విరుచుకుప‌డ్డారు. టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. నిన్నటి దాడిలో గాయపడిన కార్యకర్తలు కార్యాలయానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తల అంబులెన్స్ ని అడ్డుకున్న పోలీసులు వారిని కార్యాల‌యానికి రానివ్వ‌లేదు. త‌మ‌కు అయిన గాయాలు చూపించేందుకు పార్టీ కార్యాలయానికి వస్తుండగా అడ్డగించారు. 
 
పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై ర్యాలీగా వెళ్లిన లోకేశ్, టీడీపీ నేతలు ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాలు చేశారు. దీనితో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లోకేష్ ఒక ద‌శ‌లో పోలీస్ అధికారుల‌పై విరుచుకుప‌డ్డారు. త‌ప్పుకో... అడ్డులే... ఏం త‌మాషాలా అంటూ, పోలీసుల‌పై దూసుకెళ్ళారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల అంబులెన్స్ ను పోలీసుల దిగ్బంధం నుంచి విడిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments