Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ పకోడి కొసరు కోసం కొట్టుకున్నారు.. యువకుడి మృతి.. రాయల్ చికెన్ సెంటర్‌లో?

నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా చికెన్‌ పకోడి కొనుగోలు విషయంలో ఏర్పడిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. నందికొట్క

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (12:08 IST)
నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా చికెన్‌ పకోడి కొనుగోలు విషయంలో ఏర్పడిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులోని రాయల్‌ చికెన్‌ సెంటర్‌లో అదే ప్రాంతానికి చెందిన చంద్రమోహన్‌(30) శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చికెన్‌ పకోడి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. 
 
కొసరు విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చికెన్ సెంటర్ ఓనర్ అబూబకర్, డైమాండ్ వలి, రియాజ్, వంట మాస్టర్ కలిసి అతడిపై దాడి చేశారు. దీంతో చంద్రమోహన్‌ ఇంటికి వెళ్లి జరిగిన విషయం బంధువులకు చెప్పడంతో వారు చికెన్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. 
 
మళ్లీ ఘర్షణ చోటుచేసుకోవడంతో చంద్రమోహన్‌కు తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments