Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం మాట్లాడుతాను కాబట్టే నన్ను వెనక్కి నెట్టారు.. ఎన్నో దెబ్బలు తగిలాయ్: హరికృష్ణ

కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. నిజం మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు పెట్టారని, నిజాలు మాట్లాడబట్టే ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (09:35 IST)
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డును ప్రారంభించాల్సిందిగా హరికృష్ణను గ్రామస్థులు ఆహ్వానించారు. వారి కోరికపై అక్కడకు చేరుకున్న హరికృష్ణకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎద్దుల బండిపై ఊరేగించారు. 
 
కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. నిజం మాట్లాడతాను కాబట్టే తనను వెనక్కు పెట్టారని, నిజాలు మాట్లాడబట్టే ఇప్పటి వరకు ఎన్నో దెబ్బలు తగిలాయన్నారు. 
 
అయినా కూడా సత్యాన్ని ఎత్తిచూపడంతో పాటు నిజాన్ని కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హరికృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తండ్రిని హరికృష్ణ స్మరించుకున్నారు. తెలుగు వాడికి ఒక గొప్ప గౌరవం తీసుకువచ్చిన నేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments