ఆంధ్రజ్యోతిపై భగ్గుమన్న బాలయ్య ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:08 IST)
వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. ఏకంగా పత్రిక పేపర్లను తగులబెట్టి తమ నిరసనను తెలిపారు. కావలిలో బాలకృష్ణ అభిమానులు ఇలా నిరసనకు దిగారు. తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం-నవశకం పేరుతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే ఆంధ్రజ్యోతిలో ఆయన పేరు గానీ, ఫొటో గానీ ప్రచురించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ అభిమానులు కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను తగులబెట్టారు.
 
కాగా, నందమూరి బాలకృష్ణపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం వివక్ష చూపుతోందని బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కైవసం చేసుకున్నారు. 
 
కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారా? అది అలా కాదు. దీనికి తోడు.. ఇప్పుడు ఎల్లో మీడియా కూడా నారా కుటుంబాన్ని మాత్రమే హైలెట్ చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments