సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (08:44 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఆయన తన కుమార్తెలను చూసే నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆయన విదేశాల్లో విహరించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మొబైల్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుతో సీబీఐకు ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. 
 
సుమారుగా 35కి పైగా అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్... వచ్చే నెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బ్రిటన్‌లో ఉన్న తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకుగాను అనుమతి కోరుతూ 15 రోజుల క్రితం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంలో జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సీబీఐ కోర్టు జగన్‌‍కు షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ిచ్చింది. యూకే వెళ్ళే ముందు పర్యటనకు సంబంధించింన పూర్తి వివరాలను కోర్టుతో పాటు సీబీఐకు అప్పగించాలని ఆదేశించింది. ఇదే క్రమంలో జగన్‌కు ఐదేళ్ల కాలపరిమితో కొత్త పోర్టు జారీకి కూడా సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments