Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబారు పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. నల్గొండలో దారుణం

సాంబారు పాత్రలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూర

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (12:05 IST)
సాంబారు పాత్రలో పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో సాంబారు పాత్రలో పడి గాయపడిన విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈదులూరు గ్రామానికి చెందిన బల్కూరి జయవర్ధన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. 
 
శుక్రవారం మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన ఆ విద్యార్థిని విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం విద్యార్థి మృతి చెందాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments