Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పుకోనున్న నాగార్జున

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (12:42 IST)
మీలో ఎవరు కోటీశ్వరుడు తెలియని టీవీ వీక్షకుడు ఉండరంటే ఆశ్చర్యం లేదేమో.. ఆ ప్రోగ్రాం అంతటి పాపులర్ అయ్యింది. దానికి నాగార్జున యాంకర్‌గా వ్యవహరించడం వలనే అంతటి ప్రాముఖ్యత లభించింది. అయితే నాగార్జున ఆ ప్రొగ్రాం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని నిర్వహకులకు తెలియజేశారు. దీంతో వారు కూడా ఆందోళనలో పడిపోయారు. అసలు ఈ ప్రొగ్రాంను కొనసాగించాలా..! లేదా అనే ఆలోచనలో పడిపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నాగార్జున ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పకోవాలని నిర్ణయించడంతో వారు ప్రత్యామ్నాయ యాంకర్ కోసం వెతుకుతున్నారు. మళ్లీ వెండితెరపై అవకాశాలు పెరగడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్వహిస్తున్న మా టీవీ వారు ఆందోళనలో పడ్డారు. మరెవరినైనా ఆయన స్థానంలో నిర్వహించినా అంత ఫలితం ఉండదనే నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఏకంగా ఈ ప్రోగ్రాంనే నిలిపేయాలనే ఓ ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జునలా షోను నడపగలిగే వ్యక్తిని వెతకడం అంత సులువుకాదని వారు భావిస్తున్నారు. 
 
గతంలో కూడా కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి అమితాబ్ అర్ధాంతరంగా తప్పుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు షారూక్ ఖాన్ కు ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే కౌన్ బనేగా కరోడ్ పతి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా మీలో ఎవరు కోటీశ్వరుడూ ప్రోగ్రాంను నిలిపేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నాగార్జుననే ఒప్పించి షో కొనసాగించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏమవుతుందో వేచి చూడాల్సిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments