Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు.. నాగబాబు హర్షం

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:39 IST)
ఏపీ రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమరావతిలో రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని నాగబాబు అన్నారు.
 
ఇది అమరావతి రైతులు, మహిళలతో పాటు ఆంధ్ర ప్రజల విజయమని నాగబాబు పేర్కొన్నారు. 800 రోజులకు పైగా ఎన్నో అవరోధాలు దాటుకొని మొక్కవోని దీక్ష చేసిన అమరావతి రైతుల దీక్ష ఫలించిందని నాగబాబు అన్నారు. 
 
గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుంది. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని.. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు.  
 
అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దు.. అంటూ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments