Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు.. నాగబాబు హర్షం

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:39 IST)
ఏపీ రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమరావతిలో రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని నాగబాబు అన్నారు.
 
ఇది అమరావతి రైతులు, మహిళలతో పాటు ఆంధ్ర ప్రజల విజయమని నాగబాబు పేర్కొన్నారు. 800 రోజులకు పైగా ఎన్నో అవరోధాలు దాటుకొని మొక్కవోని దీక్ష చేసిన అమరావతి రైతుల దీక్ష ఫలించిందని నాగబాబు అన్నారు. 
 
గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుంది. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని.. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు.  
 
అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దు.. అంటూ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments