Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు.. నాగబాబు హర్షం

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:39 IST)
ఏపీ రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమరావతిలో రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని నాగబాబు అన్నారు.
 
ఇది అమరావతి రైతులు, మహిళలతో పాటు ఆంధ్ర ప్రజల విజయమని నాగబాబు పేర్కొన్నారు. 800 రోజులకు పైగా ఎన్నో అవరోధాలు దాటుకొని మొక్కవోని దీక్ష చేసిన అమరావతి రైతుల దీక్ష ఫలించిందని నాగబాబు అన్నారు. 
 
గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుంది. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని.. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు.  
 
అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దు.. అంటూ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments