Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి జనసేనలోకి నాదెండ్ల మనోహర్

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ ఉప సభాపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పార్టీ మారనున్నారు. ఆయన తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన గురువారం స్పష్టం చేశారు.
 
గురువారం సాయంత్రం మనోహర్‌ తిరుమలకు వెళ్లనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సైతం గురువారం రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
కాగా, కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి ఖచ్చితంగా షాకేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments