Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం : నాదెండ్ల

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (12:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వారీగా రైతులకు చెల్లించిన డబ్బుల వివరాలను ఆయన ఎక్స్ ఖాతా వేదికగా వివరించారు. 
 
గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్‌ టన్నులని.. బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్‌ టన్నులన్నారు. వాస్తవ లెక్కలు చూస్తే జగన్‌ నిర్వాకం తెలుస్తోందన్నారు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలను వెల్లడించారు. 
 
బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు 
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మేం బెయిల్ ఇచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది అంటూ న్యాయమూర్తి అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. 
 
క్యాష్ ఫర్ జాబ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు అయ్యారు. సుధీర్ఘకాలం పాటు జైలులో ఉన్న సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చెన్నై సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీ సారథ్యంలోని ధర్మాసన విచారణ చేపట్టింది. 
 
మేం ఇలా బెయిల్ ఇచ్చామో లేదో అలా మీరు మంత్రి అయిపోయారు. ఇపుడీ కేసులో సాక్షుల పరిస్థితి ఏంటి? మీరు మంత్రి హోదాలో అధికార పీఠంపై ఉన్నందున సాక్షుల్లో ఆందోళన నెలకొనదా? అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
అయితే, సెంథిల్ బాలాజీ బెయిల్‌పై పునరాలోచన లేదని, అతడి బెయిల్ రద్దు చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ సాక్షుల ఆందోళనకు గురవుతారన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని, ఈ అంశం వరకు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం