Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ బాబు : యాక్టివ్‌గా మారిన చంద్రన్న

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (09:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో తన జోరు కొనసాగిస్తున్నారు. ప్రధాన అంశాలపై ఆయన వరుస ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, తనను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేసే విమర్శలకు సైతం ముందుగా ట్వీట్టర్‌ ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఏదేనీ బహిరంగ సభలో పూర్తిస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇపుడు వైకాపా, టీడీపీల మధ్య డేటా వార్ కొనసాగుతోంది. దీనిపై చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. అవేంటో ఓసారి చూద్ధాం. 
 
* బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో చేయాల్సిన అరాచకాలన్నీ చేశాయి. ప్రజలు ఛీకొట్టేసరికి పలాయనం చిత్తగించాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో మకాం వేసి మనపై కుట్రలకు తెగబడ్డాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అరాచకాలు సృష్టించినా మేము వెనుకంజ వేయం.
 
* బీహార్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వైసీపీకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 8 లక్షల టీడీపీ ఓట్లను తొలగించారు. అందుకోసం ఫామ్‌-7 వినియోగించారు. చూస్తుంటే రేపు నా ఓటును కూడా తొలగిస్తారేమో. 
 
* ఆంధ్రప్రదేశ్ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరు? ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేస్తే, డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు చేస్తూ తెలంగాణ పోలీసులు కాపాడతారని డ్రామాలు చేస్తారా?
 
* డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో, డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయం. అందులో తలదూర్చితే మీ అందరి మూలాలు కదులుతాయి. మీరు చేస్తున్న నేరాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త.
 
* కేంద్రంలా మాటల గారడీ చేసే ప్రభుత్వం కాదు.. సన్న, చిన్న అనే వ్యత్యాసం లేకుండా, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇస్తోన్న ప్రభుత్వం మాది..
 
* రూ.1466 కోట్లతో తిరుపతి స్మార్ట్ సిటీ పనులకు శంకుస్థాపన చేశాం. దీని ద్వారా రూ.624 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, భూగర్భ విద్యుత్ రూ.236 కోట్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మునిసిపల్ స్కూళ్లను స్మార్ట్ కాంపస్‌లుగా తీర్చిదిద్దడం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.
 
* నదుల అనుసంధానం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డా. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని చెప్పి, ఇచ్చిన మాట ప్రకారం నీళ్లిచ్చా. ఇప్పుడు రెండు కోట్ల ఎకరాలకు నీళ్లివ్వాలన్నదే నా లక్ష్యం. అదిసాకారమై, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మమ్మల్ని మళ్లీ గెలిపించాలి.
 
* మదనపల్లెలో చిప్పిలి చెరువు నీళ్లు వదలడం, హంద్రీనీవా జలాలకు జలహారతి పట్టడం అద్భుతం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి సదుపాయం లేక వలసలు పోయే పరిస్థితి ఉండేది, అలాంటి స్థితి నుంచి ఇవాళ నిలదొక్కుకునే స్థితికి తీసుకొచ్చాం. భవిష్యత్తులో నీటి సమస్య అన్నది లేకుండా చేస్తాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments