Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు మైసూరా రెడ్డి ఝులక్.. త్వరలో వైకాపాకు రాంరాం!!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:11 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి గట్టి షాక్ ఇవ్వనున్నారు. రాజ్యసభ టిక్కెట్ ఆశించి భంగపడిన మైసూరా రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేయాలన్న తలంపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వాస్తవానికి అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. పార్టీ వ్యవహారాలతో పాటు అక్రమాస్తుల కేసులోనూ ఆయన జగన్‌కు పలు సలహాలు, సూచనలు చేశారు. అంతేకాకుండా, కడప జిల్లాలోనే కాక ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా సీనియర్ రాజకీయవేత్తగా మైసూరా రెడ్డి ఎదిగారు. ఈయన.. వైకాపాకు క్రమంగా దూరమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
 
కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న మైసూరా... భవిష్యత్తులో రాజ్యసభకు పంపుతామన్న జగన్ హామీతోనే వైకాపాలో చేరారని అపుడు వార్తలు వినిపించాయి. అయితే, ఇపుడు ఆ పార్టీ తరపున రాజ్యసభకు విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మైసూరా, త్వరలోనే జగన్ కు ఝలక్ ఇస్తారన్న వార్తలు జోరందుకున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments