జగన్ అపరిచితుడు... మైసూరా రెడ్డి 4 పేజీలు లేఖ సారాంశం ఇదే...
వైసీపీ నుంచి ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ఇప్పటికి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఇపుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటించారు. తాను వెళ్ళిపోతున్నా అం
వైసీపీ నుంచి ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ఇప్పటికి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఇపుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటించారు. తాను వెళ్ళిపోతున్నా అంటూ 4 పేజీల లేఖ జగన్ మోహన్ రెడ్డికి రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆయనది అపరిచితుడు క్యారెక్టర్.
మాటపై నిలకడ లేని మనస్తత్వం... ఎవరిమాటా వినడు... ఏ సలహా ఇచ్చినా పట్టించుకోడు... జగన్ అపరిచితుడు... అధికారంపై ఆశ ఎక్కువ... డబ్బుకు తప్ప విలువలకు తావు లేదు ఇక్కడ. మానవీయ కోణం అసలే లేదు. ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ మోహన్ రెడ్డికి లేనేలేదు... అంటూ మీడియా ఎదుట మనసు విప్పారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, అయితే తర్వాత ఏమి చేయాలనే కార్యచరణ నిర్ణయించుకోలేదన్నారు మైసూరారెడ్డి.
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ పంపుతూ... పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందని, ఆ పార్టీలో ఎదురైన ఇబ్బందులను, పార్టీ నిర్వహణలో లోపాలపై ఆయన లేఖలో సుస్పష్టం చేశారు. మైసూరా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. గతంలో జగన్ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు.. కష్టాల్లో ఉన్న పార్టీని ముందుకు నడిపించడంలో మైసూరా కీలక పాత్ర వ్యవహరించారు.
పార్టీ కోసం ఎంత కష్టపడినా పార్టీలో కనీస గౌరవం లేకపోయిందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. జగన్ ఆడిటర్ విజయసాయి రెడ్డిని పార్టీలోకి తీసుకున్నప్పటి నుంచి మైసూరాకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. రాజ్యసభ స్థానం కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. ఇదేగాక రాయలసీమ విషయంలోనూ జగన్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న అసంతృప్తితో మైసూరా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెదేపాలో చేరనున్నారా మరో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అనే విషయంలో మాత్రం ఆయన తేల్చడం లేదు. తెదేపాలో చేరతారన్న ప్రచారం మాత్రం గత కొంతకాలంగా కొనసాగుతోంది.