Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆత్మహత్య ముహూర్తం సాయంత్రం 5.49 గంటలకు, ఉక్కు కార్మికుడి లేఖ కలకలం

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (15:59 IST)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కర్మాగార కార్మికులు గత కొన్ని రోజులుగా నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఐనాసరే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేస్తోంది. వద్దని మొత్తుకుంటున్నా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతోంది. ఈ నేపధ్యంలో ఉక్కు కార్మికులందరూ ఆందోళన చేస్తున్నారు.
 
ఇదిలావుంటే ఈ రోజు ఉక్కు కార్మికుడు శ్రీనివాసరావు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆయన లేఖలో ఏం రాశారంటే.. " ప్రియమైన సోదరులారా... మనందరం కలసికట్టుగా వుంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈరోజు జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం.
 
ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేసులో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5.49 గంటలకు ముహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచి మొదలుకావాలి. జై హింద్" అంటూ లేఖ రాసి ఇంట్లో పెళ్లి వెళ్లాడు. అతడి కోసం గాలింపు చర్య చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments