Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రాజకీయ జీవితం అపుడే ముగిసిపోయింది.. కాంగ్రెస్ మాజీ ఎంపీ

ఠాగూర్
మంగళవారం, 9 జనవరి 2024 (11:23 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తోనే తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన సోమవారం మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ముగ్గురు ఎంపీలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురు మాజీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు. అలాంటి వీరి ఒక చోట సమావేశం కావడంతో కొత్త సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. 
 
ఇదే అంశంపై లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను చెప్పానని... చెప్పినట్టుగానే 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని గుర్తుచేశారు. రాజమండ్రికి తాను ఎప్పుడు వచ్చినా ఉండవల్లిని, హర్షకుమార్‌లను కలుస్తుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం ఏమీ ఉండదని... ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఉండవల్లి, హర్షకుమార్ ఏ పార్టీల తరపున పోటీ చేసినా వారికి తన మద్దతు ఉంటుందని లగడపాటి తెలిపారు. 
 
కాగా, గత 2014 సంవత్సరానికి ముందు ఈ ముగ్గురు రాజకీయ నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పలు అంశాల్లో చక్రం తిప్పారు. ఏపీ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఈ ముగ్గురు నేతలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ యాక్టివ్ అవుతున్న తరుణంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments