Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

ఐవీఆర్
బుధవారం, 1 మే 2024 (13:44 IST)
కాపు ఉద్యమ నాయకుడు అని పేరున్న ముద్రగడ పద్మనాభం అకస్మాత్తుగా వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. వైసిపిలో చేరిన తర్వాత ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన గురిపెట్టారు. పిఠాపురంలో ఆయనను ఓడించి తీరుతామని ప్రకటిస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన కిర్లంపూడిలో విలేకరులతో మాట్లాడుతూ... ముఖానికి రంగులు వేసుకుని వచ్చేస్తే పిఠాపురం జనం ఓట్లు వేస్తారా? తన్ని తరిమేయడానికి సిద్ధంగా వున్నారంటూ చెప్పుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేసారు.
 
ముద్రగడ పద్మనాభం చేసిన ప్రతిజ్ఞపై జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం అని చెప్పుకునేకంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి పేరే మీకు బాగుంటుందనీ, కాపులకు అన్యాయం చేసిన వారికి వెన్నుదన్నుగా నిలిచిన మీకు పద్మనాభ రెడ్డి పేరు సరిపోతుందంటూ చెపుతున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారనీ, ప్రజలంతా పవన్ కల్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments