Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (13:40 IST)
హైదరాబాద్ నగరంలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురానగర్‌లో నివాసం ఉంటున్న ఇల్లు కూడా బఫర్ జోనులోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం సాగుతుంది. హైడ్రా ఆధ్వర్యంలో బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా, మొహమాటానికి తావు లేకుండా పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా కూల్చి వేస్తున్న క్రమంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సొంత ఒకప్పటి పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన ఇల్లు బఫర్ జోనులో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. మధురానగర్ లో 44 ఏళ్ల క్రితం మా తండ్రిగారైన ఏపీవీ సుబ్బయ్య నిర్మించారని, ఆ ఇంట్లోనే తాము ఉంటున్నామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్క్ మార్చారన్నారు. కృష్ణకాంత్ పార్క్‌‍ మా ఇంటికి మధ్య వేలాది ఇళ్లు ఉన్నాయన్నారు. చెరువు కట్ట దిగువన పది మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావని స్పష్టంచేశారు.
 
సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము నివాసం ఉంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉందన్నారు. తమ ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటరు దూరంలో ఉందన్నారు. తాము ఉంటున్న ఇల్లు బఫర్ జోన్‌లో లేదు అనేది వాస్తవమని అందరూ గ్రహించాలని కోరారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని కోరుతూ ఫొటోలు కూడా రంగనాథ్ విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments