Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో యువతి అదృశ్యం... ఫిర్యాదు చేసిన తల్లి...

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (22:40 IST)
తిరుపతిలోని కొర్లగుంటలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. 18 యేళ్ళ భార్గవి ఈ నెల 3వతేదీ నుంచి కనిపించడం లేదు. ఇంట్లో తల్లి రాణితో పాటు ఉంటున్న భార్గవి కళాశాల ఫీజు కట్టి వస్తానని ఇంటి నుంచి వెళ్ళింది. ఆ తరువాత 25 రోజులవుతున్నా కనిపించకుండా పోయింది. దీంతో తల్లి రాణి స్థానిక ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. 
 
ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే ఐజి, డిఐజికి లేఖ రాసింది. అయితే భార్గవి మేజర్ కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది రాణి. తన కుమార్తెను నందకుమార్, శిరీషలు కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన విషయాన్ని రాతపూర్వకంగా ఇచ్చినా పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు పెట్టారంటోంది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని, తన కుమార్తెను సురక్షితంగా అప్పజెప్పాలని కోరుతోంది.
 
అయితే పోలీసులు మాత్రం భార్గవి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి వివాహం చేసుకుందని చెబుతున్నారు. రాణి, భార్గవి తండ్రికి మధ్య గొడవలు ఉన్నాయని దీంతో ఆమె తండ్రి దగ్గరకే వెళ్ళిపోయిందని, ఎన్నిసార్లు రాణికి చెప్పినా అర్థం కావడం లేదంటున్నారు పోలీసులు. మరి దీనిపై ఆమె తన కేసును వెనక్కి తీసుకుంటారో లేదంటా ఇలాగే మాట్లాడుతారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments