Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు సారీ చెబుతున్నా... పిల్లి పార్టీ వీడినట్టేనా?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (14:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సారీ చెప్పారు. అయితే, తాను పార్టీ వీడుతానన్న అంశంపై ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. 
 
గత కొన్ని రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రాజ్యసభ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో చంద్రబోస్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా, పార్టీ వీడుతానని వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది.
 
దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నపుడు వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నేతలతో ఉంటుందన్నారు. అదే సమయంలో తాను వైకాపాను వీడుతానన ఎన్నడూ చెప్పలేదన్నారు. కానీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన మాట నిజమేనని తెలిపరు. ఆ వ్యాఖ్యలు కూడా ఎంతో బాధతో చేశానని ఈ విషయంలో సీఎం జగన్‌కు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments