హోటళ్లలో మటన్ తింటున్నారా? జాగ్రత్త..!

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (16:34 IST)
హోటళ్లలో మటన్ లాగించేస్తున్నారా..? జాగ్రత్త అంటున్నారు.. అధికారులు. టన్ లెక్కల్లో జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారని తాజాగా తేలింది. హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్ షాపులకు గేదె మాంసాన్ని సరఫరా చేస్తున్నారని తెలిసింది. నెల్లూరు శివారు ప్రాంతాల్లోని కబేళాలపై నిర్వహించిన దాడుల్లో ఈ విషయాన్ని ఆరోగ్య శాఖాధికారులు తేల్చారు. 
 
అంతేగాకుండా కుళ్లిపోయిన మాంసాన్ని కూడా అధికారులు గుర్తించారు. దీంతో మటన్ మాఫియా బాగోతం వెలుగులోకి వచ్చింది. మటన్ కబేళాలలో జంతువుల మాంసం విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. 
 
కాబట్టి మటన్ మాంసాన్ని కొనేటప్పుడు వ్యత్యాసం గుర్తిస్తే అధికారులు ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయాలని.. హోటళ్లలోనూ మటన్ టేస్టు మారితే అధికారులకు ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఇంకా గేదె మాంసం కుళ్లిన పరిస్థితుల్లో వుందని.. అలాంటి వాటిని హోటళ్లలో తినకపోవడం మంచిదని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments