Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేనట్టే : మురళీ మోహన్

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (10:40 IST)
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం అంత సులభమైన విషయం కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం తెలిపే సమయంలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన బీజేపీ ఎంపీ, రాష్ట్రనేత వెంకయ్య నాయుడే ఈ ప్రత్యేక హోదాపై సందేహం వ్యక్తం చేయడంతో ఆయన పల్లవిని అధికార టీడీపీకి చెందిన ఎంపీలు కూడా అందుకున్నారు. 
 
ఇదే అంశంపై మురళీమోహన్ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా రావడం కష్టంగా ఉందన్నారు. పలువురు కేంద్ర మంత్రులు ఇది సాధ్యం అయ్యేలా లేదని చెబుతున్నారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇవ్వవలసి వస్తుంది. అందువల్ల పరోక్ష సాయం చేస్తామని మంత్రులు చెబుతున్నారని మురళీమోహన్ స్పష్టం చేశారు. మొత్తం మీద కేంద్రంపై దీని గురించి ఆశలు వదలుకున్నట్లే కనిపిస్తోంది. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments