Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో కటీఫా.. పవన్‌తో దోస్తీనా అనేది త్వరలో తేలిపోతుంది: టీజీ వెంకటేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయంపై టీజీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ చెబ

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (12:49 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయంపై టీజీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ చెబితే వినడానికి తామేమైనా చిన్నపిల్లలమా అంటూ చురకలంటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారన్న విషయాన్ని టీజీ ఎత్తి చూపారు.
 
భారతీయ జనతా పార్టీతో దోస్తీ వదులుకుని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో కలుస్తామా లేదా? అనేది ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబునే బీజేపీ పట్టించుకోలేదని.. అలాంటప్పుడు తామెంత అన్నట్లుగా టీజీ కామెంట్లు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని టీజీ వెంకటేశ్ కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments