అగ్నికి ఆహుతైన అంతర్వేది రథం - ఓ మతంపై జరిగిన దాడి : వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (11:23 IST)
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన రథం అగ్నికి ఆహుతి కావడం వెనుక పెద్ద కుట్రే ఉందని వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అంతర్వేదిలో క్రీ.పూ.300 సమయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి చెందిన ఊరేగింపు రథం అగ్నికి ఆహుతి అయింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, రథం కాలిపోయిన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ అనుమానం కలుగుతోందన్నారు. కింది నుంచి పైదాకా ఒకేసారి ఈ రథం తగులబడటం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఒకవేళ కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉంటే ఈ రకంగా రథం పూర్తిగా బూడిదయ్యే అవకాశం లేదన్నారు. 
 
'గతంలో కొన్ని చోట్ల ఇలాగే జరిగితే ఎవరో పిచ్చివాళ్లు చేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఎవరో పిచ్చివారి పిచ్చిచేష్ఠగానే ముద్రవేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే... కావాలని ఒక మతంపై జరిగిన దాడిలా అనిపిస్తోంది. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కేవలం ప్రకటనతోనే సరిపెట్టుకోకుండా దోషులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలి' అని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments