Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మాభిమానం చంపుకుని వైకాపాలో ఉండలేను: కొత్తపల్లి గీత

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (17:22 IST)
ఆత్మాభిమానం చంపుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆ పార్టీ అరకు లోక్ సభ సభ్యురాలు కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. తద్వారా కొత్తపల్లి గీత పార్టీ వీడడం ఖాయమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీ గీత మీడియా ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథాన పురోగమిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తేలిపోయింది. 
 
ఇంకా అరకులో ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారన్నారు. పార్టీలోని నేతలు పార్టీ చేపట్టే కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని గీత వెల్లడించారు. పార్టీలో తన ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని,  ఎస్టీ మహిళనని తనను చాలా అవమానించారని చెప్పారు.  
 
వైఎస్సార్సీపీ నేతల వ్యవహార శైలితో మహిళా నేతలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని గీత తెలిపారు. త్వరలో చాలా మంది మహిళా నేతలు వైఎస్సార్సీపీ వీడుతారని ఆమె అభిప్రాయపడ్డారు.

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

Show comments