Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు భద్రత పెంచండి... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:04 IST)
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు దాడికి ప్రయత్నించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు తెదేపా ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపైనే దాడికి ప్రయత్నించారని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఈ ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని, దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని ప్రస్తావించారు. ఈ మేరకు దాడి ఘటన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేద‌ని, ఉల్టా తెదేపా నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశార‌ని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే, ఈ ఘటన జరిగిందని వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తెలిపార‌ని క‌న‌క‌మేడ‌ల వివ‌రించారు. ఈ దాడి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామ‌ని, ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments