Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు భద్రత పెంచండి... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:04 IST)
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు దాడికి ప్రయత్నించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు తెదేపా ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపైనే దాడికి ప్రయత్నించారని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఈ ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని, దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని ప్రస్తావించారు. ఈ మేరకు దాడి ఘటన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేద‌ని, ఉల్టా తెదేపా నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశార‌ని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే, ఈ ఘటన జరిగిందని వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తెలిపార‌ని క‌న‌క‌మేడ‌ల వివ‌రించారు. ఈ దాడి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామ‌ని, ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments