కుటుంబ కలహాలు ఆఇల్లాలిని వేధించాయి. అత్త, ఆడపడుచు సూటిపోటి మాటలు ఆమె మనసుకు ఈటెల్లా గుచ్చుకున్నాయి. ఇక తాను భరించలేక చావాలనుకుంది. కానీ కాళ్లకు బిడ్లలు అడ్డపడ్డారు. వారిని కూడా రైలు కింద తోసేసి తాను దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే జమ్ముల పాలెం గ్రామానికి చెందిన నాగ వర్తులమ్మగూడ్స్ రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. బిడ్డల్ని గూడ్సు రైలు కింద తోసేసి తాను దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతులు బాపట్ల మండలం చెరువు గా గుర్తించారు. అత్త, ఆడపడచు వేధింపులే కారణమని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది.