Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలను రైలు కింద తోసేసి... తాను దూకి తల్లి ఆత్మహత్య

Webdunia
గురువారం, 2 జులై 2015 (11:04 IST)
కుటుంబ క‌ల‌హాలు ఆఇల్లాలిని వేధించాయి. అత్త‌, ఆడ‌ప‌డుచు సూటిపోటి మాట‌లు ఆమె మ‌న‌సుకు ఈటెల్లా గుచ్చుకున్నాయి. ఇక తాను భ‌రించ‌లేక చావాల‌నుకుంది. కానీ కాళ్ల‌కు బిడ్ల‌లు అడ్డ‌ప‌డ్డారు. వారిని కూడా రైలు కింద తోసేసి తాను దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గుంటూరు జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. 
 
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే జమ్ముల పాలెం గ్రామానికి చెందిన నాగ వర్తులమ్మగూడ్స్ రైలు కింద పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. బిడ్డ‌ల్ని గూడ్సు రైలు కింద తోసేసి తాను దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మృతులు బాపట్ల మండలం చెరువు గా గుర్తించారు. అత్త, ఆడపడచు వేధింపులే కారణమని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments