Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలపై శానిటైజర్ పోసింది నిప్పంటించి.. తాను కూడా ఆత్మహత్య..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (15:52 IST)
తన ఇద్దరు చిన్నారులకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు సీఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుపాలెంకు చెందిన సుబ్బులు తన ఇద్దరు చిన్నారులతో కలిసి కర్ణాటకలోని బళ్లారి వద్ద వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం బళ్లారి నుంచి ఈమె తన ఇద్దరు పిల్లలతో బయలుదేరింది. 
 
శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరుపాలెం వద్ద దిగింది. గ్రామానికి వెళ్లే మార్గంలోఉన్న శ్మశాన వాటిక స్థలంలో తనతో పాటు పిల్లలపై శానిటైజర్ పోసి నిప్పంటించుకుంది. ఈ ప్రమాదంలో సుబ్బులు, కుమార్తె మధురవాణి(5) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
కుమారుడు మహేశ్ మంటల వేడికి తప్పించుకొని పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మహేశ్ గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments