Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తికోసం కన్న కూతుర్ని చంపిన తల్లి... దారుణం!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (18:46 IST)
హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు కడతేర్చింది. స్థానికంగా నివాసం ఉండే కళ్యాణి(25)ను ఆమె కన్నతల్లి లక్ష్మి(50) కత్తితో నరికి చంపడమే కాక.. శవం పక్కనే కత్తి పట్టుకుని నిలబడింది.
 
దీంతో ఆమెను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు. అంతా కలిసి లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. తల్లీ కూతుళ్ల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి.
 
ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య చేశారని ఇరుగుపొరుగు వారు చెపుతున్నారు. ఈ హత్య చేయడానికి మిగతా ఇద్దరు కూతుళ్ళు కూడా తల్లికి సహకరించారని సమాచారం. లక్ష్మి తన కూతుర్ని హత్య చేయడానికి ముందు తన ఇంటి చుట్టూ వున్న సి.సి. కెమెరాలను ధ్వంసం చేయడం విశేషం. బంజారాహిల్స్‌ పోలీసులు లక్ష్మితోపాటు మిగతా ఇద్దరు కూతుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments