Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెమ్ముతో బాధపడుతున్న పురిటికందును చంపేసిన తల్లి..

ఓ తల్లి నెమ్ముతో బాధపడుతున్న పురిటికందు బాధ చూడలేక చంపేసింది. ఈ ఘటన శ్రీశైలం మండలం సున్నిపెంట పట్టణంలో చోటుచేసుకుంది. పూర్ణానంద అశ్రమం సమీపంలో నివశిస్తున్న సన్నిధి శేఖర్‌, లక్ష్మీ ప్రసన్నల కూతురు లక్ష

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (08:30 IST)
ఓ తల్లి నెమ్ముతో బాధపడుతున్న పురిటికందు బాధ చూడలేక చంపేసింది. ఈ ఘటన శ్రీశైలం మండలం సున్నిపెంట పట్టణంలో చోటుచేసుకుంది. పూర్ణానంద అశ్రమం సమీపంలో నివశిస్తున్న సన్నిధి శేఖర్‌, లక్ష్మీ ప్రసన్నల కూతురు లక్ష్మీ శ్రావణిని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి నాలుగేళ్ల కింద పెళ్లి చేశారు.

ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉండగా, శ్రావణికి 18రోజుల క్రితం రెండో కాన్పులో అడబిడ్డ జన్మించింది. వారం రోజుల క్రితం పాపకు సున్నిపెంటలో బారసాల చేశారు. కిరణ్మయి అని పేరు పెట్టారు. అయితే పాప పుట్టుకతో నెమ్ము వ్యాధితో బాధపడుతోంది.
 
పైగా మొదటి సంతానం బాబు కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. పాప పుట్టినప్పటి నుంచి నెమ్ముతో బాధపడుతున్న తీరు శ్రావణి చూడలేకపోయింది. పేదరికం వల్ల వైద్యం చేసే స్థామత లేదు. అంతే సోమవారం చిన్నారిని చంపేసింది. ఆపై నీటి ట్యాంకులో పడేసింది. పాప కనపడటంలేదని ఇరుగు పొరుగు వారితో చెప్పింది. దీంతో బం ధువులు, మిత్రులు కాలనీ అంతా వెతికారు. చివరికి ఇంటి పైన ఉన్న సింటెక్స్‌ ట్యాంక్‌లో చూడగా పాప శవం కనిపించింది.
 
ప్రాణం ఉందేమో అని వైద్యశాలకు తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అయితే పోలీసు విచారణలో శ్రావణి చంపేసిన విషయాన్ని అంగీకరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments