Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వానరానికి కోపం వచ్చింది.. ఏం చేసిందో తెలుసా?

ఆ వానరం చేసిన చేష్టలకు అందరూ జడుసుకున్నారు. తనకు తినేందుకు ఏమీ దొరకలేదనే కోపంతో కోతి చేసిన పిచ్చి చేష్టలు.. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. గోదావరి ఖని సమీపంలోని సెంటినరీ

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (11:07 IST)
ఆ వానరం చేసిన చేష్టలకు అందరూ జడుసుకున్నారు. తనకు తినేందుకు ఏమీ దొరకలేదనే కోపంతో కోతి చేసిన పిచ్చి చేష్టలు.. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. గోదావరి ఖని సమీపంలోని సెంటినరీ కాలనీలో జనగామ వెంకటేశ్ అనే యువకుడు కొన్ని తినుబండారాలను తీసుకుని వెళుతుండగా, ఓ కోతి వాటిని లాక్కోబోయింది. దీంతో వెంకటేష్ పక్కనే ఉన్న ఓ కర్రను తీసుకుని దాన్ని బెదిరించాడు. అంతే కోతికి కోపం వచ్చేసింది. 
 
పక్కనే వున్న పొయ్యిలో మండుతున్న కర్రను అందుకుని.. పక్కనే వున్న తాటిచెట్టు ఎక్కింది. దీంతో తాటికొమ్మలకు మంటలు అంటుకుని, పక్కనున్న చెట్లకు మంటలు వ్యాపించాయి. తొలుత పిడుగు పడి చెట్లు కాలుతున్నాయని అక్కడి వారు భావించారు. దీంతో అవి ఎక్కడ ఇళ్లపై పడతాయోనని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. 
 
ఆపై మంటలు చెట్ల వరకూ మాత్రమే పరిమితం కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పనిచేసిన ఆ కోతి ఓ కుర్రును పట్టుకుని తాటిచెట్టు కిందనే కూర్చుని వుండిపోయింది. దీన్ని చూసిన గ్రామస్థులంతా షాక్ తిన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments