Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటరమణ భార్య!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (08:56 IST)
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ స్థానంలో ఆయన భార్యకే టిక్కెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన వెంకటరమణ భార్య సుగుణ సమర్థురాలేనని గురువారం జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతి అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో సుగుణకు టిక్కెట్ కేటాయించడం ఖాయమైనట్టేనని తిరుపతి టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 
 
కాగా, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వెంకటరమణ, సుగుణ దంపతులకు ఇద్దరు కూతుర్లున్నారు. అయితే వారిద్దరూ బధిరులే కావడంతో తిరుపతి అసెంబ్లీ టికెట్‌ను వెంకటరమణ భార్య సుగుణకే ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంకటరమణ భార్యను రంగంలోకి దించడంతో విపక్షం కూడా అక్కడ అభ్యర్థిని నిలిపే అవకాశాలుండవని కూడా బాబు యోచిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments