Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు అమ్మే రైతులు కోటీశ్వరులు కావడం లేదు ఎందుకని : ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2015 (13:56 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు పాలు అమ్ముకుని జీవిస్తున్నారని, వారంతా కోటీశ్వరులు కావడం ఎందుకని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. కానీ, రైతుల వద్ద నుంచి పాలు సేకరించి.. హెరిటేజ్ పేరుతో పాల వ్యాపారం చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కోటీశ్వరుడు అయ్యారని, ఇందులోని కిటుకేంటో రైతులకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. ఇటీవల కుటుంబ ఆస్తులు ప్రకటించిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని, జీవితం ఇలానే చాలా బాగుందని అన్నారని గుర్తు చేశారు. పాలు, కూరగాయలతో కోట్లు సంపాదించే కిటుకేంటో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి హెరిటేజ్‌కు పాలు అమ్మిన రైతులెందుకు కోటీశ్వరులు కావడంలేదని సూటిగా ప్రశ్నించారు. 
 
నారాయణ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఇంతవరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయరని సూటిగా ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన యాజమాన్యాలపై కేసు పెడతామని మంత్రి గంటా చెప్పారని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments