హమ్మ!.. ఆ ఎమ్మెల్యే దేవినేని ఉమని ఎంత మాటనేశాడు?

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (07:28 IST)
మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు సవాల్ విసిరారు.  మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ.. నాకు లారీలు గాని ఇసుక వ్యాపారంలో వాటాలు ఉన్నట్లు గాని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. నీకు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. 
 
"నేను అగర్బశ్రీమంతుడనని ఎప్పుడైనా చెప్పానా? నీలా పిచ్చి పిచ్చిగా వాగే అలవాటు నాకు లేదు. ఈడి కేసులు ముద్దాయిలు అంటూ మతిలేని మాటలు మానుకో. నాకు నీలా పదవులు పిచ్చి లేదు. ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తూ ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేస్తున్నాను. 
 
నీలా ఇసుక, నీరు- చెట్టు మైనింగ్ మాఫియా లీడర్ గా నేను రాలేదు. మైలవరంలో నీ గ్యాంగ్ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. అందుకే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ బుద్ధి మార్చకో. లేకపోతే నీకు తగిన గుణపాఠం నేను చెబుతాను" అని అన్నారు. 
 
"నీకు బురదగుంటలో పొర్లాడే పందికి పెద్ద తేడా లేదు తెలుసుకో. మతిలేని మాటలు మానుకొకపోతే నేరుగా వచ్చి నీ సంగతి తేల్చుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైలవరం నియోజకవర్గంలో దోపిడీ లక్ష్యంగా నీవు పని చేశావు. అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను. 
 
దేవినేని ఉమా! పిచ్చి వాగుడు మానుకో. లేకపోతే ప్రజా క్షేత్రంలో నీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా" అంటూ సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments