ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. మరోవైపు ఎండలే ఎండలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగటిపూట ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు వచ్చే మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ ఉప కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకుతోడు ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కనిపిస్తుందని తెలిపారు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా 60 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. మరోవైపు, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన తీరం దాటుతుందని తెలిపింది.

మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మనార్‌ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటి అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన మోకా.. గత రాత్రి తీవ్ర తుఫానుగా మారింది. శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments