Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలతో నీచ రాజకీయాలు: వాసిరెడ్డి పద్మ

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (10:48 IST)
ఉద్యమాల ముసుగులో ఆడవాళ్లను ముందుకు పెట్టి, వారి వెనుక దాక్కుని కొన్ని రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.

పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అడ్డం పెట్టుకుని చేస్తున్న చిల్లర రాజకీయాలను ఖండించారు. అమరావతిలో పదవులు తీసుకుని, పెత్తనం చేసిన మగవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు.

ఎందుకు ఆడవాళ్లను రోడ్లమీదకు తీసుకువచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు తీసుకోవడానికి, పెత్తనం చేయడానికి మాత్రమే మగవాళ్లు పరిమితమా అని మండిపడ్డారు. ఆడవాళ్లను ముందుకు నెట్టి వారు అరెస్ట్ అయితే దానిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తున్నారని ఇది ఎక్కడి పాలసీ అని రాజకీయపక్షాలను నిలదీశారు.

ఆనాడు ప్రత్యేక హోదా వద్దు... ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరినప్పుడు మహిళలను అడిగే చేశారా అని ప్రశ్నించారు. దెబ్బలు తింటానికే మహిళలను ముందుకు పెడుతున్న విధానాలను ఖండించాల్సిన అవసరం వుందని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భూములు కొనుగోలు చేసిన మగవాళ్లు, ప్రజాప్రతినిధులు ఏమయ్యారని ప్రశ్నించారు. రాజకీయాల్లో మహిళలను పావులుగా వాడుకుంటున్నారని అన్నారు.

విజయవాడలో బంద్ చేసే సత్తా లేనివారు. ఆడవాళ్లను రోడ్డుమీదకు తీసుకువచ్చి, ఎండలో మీచావు మీరు చావండి అని వదిలివేస్తారా అని మండిపడ్డారు. పదువులకు మగవాళ్లు, ఉద్యమాలకు మహిళలు కావాలా అని ప్రశ్నించారు. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ తప్పుడు విధానాలను అందరూ ఖండించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments