Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను తల్లిని చేసిన కామాంధుడు.. ఏడేళ్ళ జైలుశిక్ష విధించిన కోర్టు

కడప జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం చేసి తల్లిని చేసిన కేసులో ఓ కామాంధుడికి స్థానిక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (10:06 IST)
కడప జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం చేసి తల్లిని చేసిన కేసులో ఓ కామాంధుడికి స్థానిక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట కొత్తవడ్డెపల్లెకు చెందిన బాలిక.. చక్రాయపేట మండలం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి చదువుతూ వచ్చింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లగా, ఆరోజు చీకటిపడ్డాక ఊరి పొలిమేరలో ఉన్న చిన్నబావి వద్ద స్నానం చేయడానికి వెళ్లింది. అప్పటికే అక్కడ మాటువేసివున్న వీరాంజనేయులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె భయపడి ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పకుండా మళ్లీ పాఠశాలకు వెళ్లింది. కొన్ని నెలలకు స్కూలు సిబ్బంది ఆమె గర్భందాల్చిన విషయం గుర్తించారు. 
 
2010 జనవరి 11న ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. బాధితురాలి తండ్రి ఆ ఏడాది ఫిబ్రవరి 8న లక్కిరెడ్డిపల్లె పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా.. బాధితురాలి గర్భంలో పెరుగుతున్న శిశువుకు వీరాంజనేయులే తండ్రి అని వైద్యులు నిర్ధారించారు. అయితే అతడు మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసినందుకు రాయచోటిలోని జిల్లా సెషన్స్‌ కోర్టు అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments